ఖమ్మం: ఖమ్మం నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని , దీనిలో భాగంగా నగరంలోని అన్ని డివిజన్లలో రహదారులు నిర్మించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. హైద్రాబాదు నగరానికి ధీటుగా ఖమ్మం నగరాన్ని అభివృద్ధి పర్చడంలో భాగంగా కార్పొరేషన్ పరిధిలో ప్రతి డివిజన్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు గాను సీసీ రోడ్స్ నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
గురువారంనగరంలోని 10 వ డివిజన్ చైతన్య నగర్ లోరూ .36 లక్షలతో రెండు రోడ్లు , 18 వ డివిజన్ శ్రీరాం హిల్స్ లో రూ .39.50 లక్షలు మొత్తం రూ .75.50 లక్షలతో నిర్మించిన వ్యాక్యుమ్ డివాటర్డ్ ఫ్లోరింగ్ రోడ్సును నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం కార్పొరేషన్ మొత్తం అవసరమైన చోట ప్రతి రోడ్డును సీసీ రోడ్లుగా మారుస్తామన్నారు.