ఖమ్మం: ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆర్ధికశాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య సౌమ్యుడిగా, సహనశీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించారని గుర్తు చేశారు. వారితో తనకున్న అనుబంధాన్ని మంత్రి పువ్వాడ గుర్తు చేసుకున్నారు. వారి అకాల మరణం అత్యంత బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.