ఖమ్మం : ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించనున్నమినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణతో కలిసి శంకుస్థాపన చేశారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్. ఈసందర్భంగా ఆయనతోపాటు జిల్లా కలెక్టర్ గౌతమ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, సూడా చైర్మన్ విజయ్, సర్పంచ్ ధారా శ్యామ్, వివిధ శాఖల అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.