ఖమ్మం : రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణీ బైక్పై తిరుగుతూ
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో 39 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిరుపేదలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఈ పథకాలు వరంలా మారాయన్నారు.
సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.