అమరావతి : ఖమ్మం మెడికల్ కళాశాలలో జరిగిన ర్యాగింగ్ (Ragging) ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ (Minister Damodara Raja Narsimha ) ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ర్యాగింగ్ పేరిట భవిష్యత్ పాడుచేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు.
ఈ అంశంపై ఉన్నతాధికారులతో ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ (Teliconference) నిర్వహించారు. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై విచారణ జరిపి తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలపై అన్ని కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇందుకు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకోవాలన్నారు. ర్యాగింగ్ వల్ల విద్యార్థుల భవిష్యత్పై ప్రభావం పడకుండా చూడాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. జూనియర్లతో సీనియర్లు ఫ్రెండ్లీగా ఉండాలి తప్పితే, ర్యాగింగ్ పేరిట భయాందోళనకు గురి చేయవద్దని కోరారు.