ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటన వాయిదా పడింది. జనవరి2 తేదీన మంత్రి పర్యటన ఉన్నది. ఈ పర్యటన వాయిదా పడిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవారం పేర్కొన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నిర్వహించతలపెట్టిన పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు మరో తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు.
తదుపరి తేదీని మళ్ళీ ప్రకటిస్తామన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు పర్యటన యదాతధంగా కొనసాగుతుందన్నారు.