దమ్మపేట, జనవరి 11: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలోని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో బుధవారం రాత్రి ఆయన్ను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి, సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, రైతుబంధు సమితి ఖమ్మం జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు ఆహ్వానించారు. అనంతరం సభ నిర్వహణపై భేటీ అయ్యారు. తుమ్మలను కలిసిన వారిలో రైతుబంధు సమితి ఖమ్మం జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, రెండు జిల్లాల ఐసీడీఎస్ సమన్వయకర్త తూతా నాగమణి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు, కాసాని నాగప్రసాద్, ఎర్రా వసంతరావు తదితరులు ఉన్నారు.