‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో రాష్ట్రంలోకెల్లా ఖమ్మం జిల్లానే అగ్రస్థానంలో ఉన్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని ప్రొద్దుటూరు, నాగులవంచ తదితర గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం చారిత్రక అవసరమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మధిర అభివృద్ధికి నోచుకోలేదని, తెలంగాణ వచ్చాక ఖమ్మంతో సమానంగా మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించాకే కేసీఆర్ కుటుంబంపై ఈడీ దాడులు జరుగుతున్నాయని అన్నారు.
చింతకాని, మార్చి 20: ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో రాష్ట్రంలోకెల్లా ఖమ్మం జిల్లానే అగ్రస్థానంలో ఉన్నదని మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మధిర అభివృద్ధికి నోచుకోలేదని, తెలంగాణ వచ్చాక ఖమ్మంతో సమానంగా మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించాకే కేసీఆర్ కుటుంబంపై ఈడీ దాడులు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం చారిత్రక అవసరమని అన్నారు. మండలంలోని ప్రొద్దుటూరు, నాగులవంచ తదితర గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ప్రొద్దుటూరులో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. దళితబంధు పైలట్ ప్రాజెక్టులో చింతకాని మండలం ఎంపికైందని, 3,462 కుటుంబాలకు ఈ పథకం కింద ఆర్థిక స్వావలంబన లభించిందని గుర్తుచేశారు. ఇటీవల వచ్చిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రతిపక్ష నాయకులు మోకాళ్ల యాత్రలు చేసినా అధికారంలోకి రాలేరని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్కు జాతీయస్థాయిలో ఆదరణ పెరుగుతుండడం, జాతీయ పార్టీ పెట్టడంతోనే ఆయన కుటుంబంపై బీజేపీ ప్రభుత్వం ఈడీతో కేసులు పెట్టిస్తోందని దుయ్యబట్టారు. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. జాతీయస్థాయిలో బీజేపీకు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సేనని అన్నారు. కాగా, ప్రొద్దుటూరు – నేరడ, ప్రొద్దుటూరు – పాతర్లపాడు గ్రామాల మధ్య లింక్ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హమీ ఇచ్చారు.
మండలంలో నాగులంవంచలో రూ.64.50 లక్షలతో నిర్మించిన గోదామును మంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రొద్దుటూరులో రూ.16 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖాన భవనాన్ని, మన ఊరు – మన బడి భాగంగా తీర్చిదిద్దిన ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. జడ్పీ, డీసీసీబీ, టీఎస్ సీడ్స్, డీసీఎంఎస్ చైర్మన్లు లింగాల కమల్రాజు, కూరాకుల నాగభూషణం, కొండబాల కోటేశ్వరరావు, రాయల శేషగిరిరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు రాజేశ్, భారతమ్మ, శేషగిరి, అచ్చయ్య, పుల్లయ్య, తిరుపతి కిశోర్, పూర్ణయ్య, హనుమంతరావు, సోమశేఖరశర్మ, మంగీలాల్, శ్రీనివాస్, రవీంద్రప్రసాద్, రమేశ్, వెంకటేశ్వర్లు, సురేశ్, కుటుంబరావు, వెంకట్రామారావు, నరసింహరెడ్డి, శ్యాంసన్, ప్రణీత తదితరులు పాల్గొన్నారు.