ఖమ్మం, సెప్టెంబర్ 29: ‘పేదలను అన్ని విధాలా ఆదుకుంటున్న కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలుస్తోంది’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని జీవో 58, 59 కింద పేదలకు మంజూరైన ఇళ్ల పట్టాలను, గృహలక్ష్మి కింద పేదలకు మంజూరైన ప్రొసీడింగ్ పత్రాలను స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు.
సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ నిలుస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలో నిరుపేదలకు రూ.500 కోట్ల విలువైన స్థలాలను అందజేశామని, స్వాతంత్య్రం వచ్చాక ఒకేసారి 5 వేల మంది పేదలకు పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు మాత్రమేనని స్పష్టం చేశారు. పేదలను అన్ని విధాలా ఆదుకుంటున్న కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, ఖమ్మాన్ని తీర్చిదిద్దిన తనకు ఈ ఎన్నికల్లో అధిక మెజార్టీ అందించాలని కోరారు. ఖమ్మం నగరంలోని జీవో 58, 59 కింద పేదలకు మంజూరైన ఇళ్ల పట్టాలను, గృహలక్ష్మి కింద పేదలకు మంజూరైన ప్రొసీడింగ్ పత్రాలను స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు.
గృహలక్ష్మి లబ్ధిదారులకు ఇప్పటికే మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని, తాజాగా 4, 5, 6, 7, 8, 9, 10, 14, 16, 22, 26, 31, 32, 36, 37, 39, 40, 41, 50, 58 డివిజన్ల లబ్ధిదారులకు అందజేస్తున్నామని వివరించారు. కలెక్టర్ వీపీ గౌతమ్, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, కమిషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ కమిషనర్ మల్లీశ్వరి, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు గణేశ్, స్వామి, కర్నాటి కృష్ణ, పగడాల నాగరాజు, కమర్తపు మురళి, కూరాకుల వలరాజు, రాపర్తి శరత్, పల్లా రోజ్లీనా, మడూరి ప్రసాద్, మేడారపు వెంకటేశ్వర్లు, ఆరెంపుల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.