మధిర :ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషిచేయాలని ఎంఈవో వై.ప్రభాకర్ అన్నారు. గురువారం మండల పరిధిలోని మాటూరు పాఠశాలలో కాంప్లెక్స్స్థాయి సమావేశం నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం దివి సాయికృష్ణమాచార్యులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు విద్యాబోధన అందించాలని, ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ సెక్రటరీ రంగు కృష్ణాంజనేయులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.