ఖమ్మం:ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్లో నూతనంగా నిర్మిస్తున్న ఖమ్మం కార్పొరేషన్ భవన్ నిర్మాణ పనులను నగర మేయర్ పునుకొల్లు నీరజ శనివారం పరిశీలించారు. సంబంధిత గుత్తేదారును భవన నిర్మాణ పురోగతిని గురించి అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సంఖ్య పెంచి పనులను శరవేగంగా పూర్తి చేయాలని మేయర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా మేయర్తో పాటు స్థానిక కార్పొరేటర్ పడగాల శ్రీవిద్య, టిఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు తదితరులు ఉన్నారు.