లక్ష్మీదేవిపల్లి, డిసెంబర్ 25: నడుచుకుంటూ వెళ్తున్న వారిని వెనుక నుంచి వచ్చిన యాష్ ట్యాంకర్ ఢీకొంది. ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మీదేవిపల్లిలో కర్మకాండలకు గిరిప్రసాద్ కాలనీకి చెందిన కుంజా మల్లయ్య, గుమ్మడి నాగేశ్వరరావు హాజరయ్యారు. వారిద్దరూ ఆదివారం తెల్లవారుజామున కాలి నడకన తిరుగు ప్రయాణమయ్యారు.
జాతీయ రహదారి పక్క నుంచి వెళ్తున్న వీరిని, పాల్వంచ నుంచి కోదాడ వైపు వెళ్తున్న యాష్ ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొంది. కుంజా మల్లయ్య(50) అక్కడికక్కడే మృతి చెందాడు. గుమ్మడి నాగేశ్వరరావుకు బలమైన గాయాలయ్యాయి. మల్లయ్య కుమారుడు కుంజా వంశీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.