కారేపల్లి, మే 26 : కారేపల్లి మండల పరిధిలోని గుంపెల్లగూడెం గ్రామానికి చెందిన కునుసోత్ సీతారాములు(45) మోటార్ సైకిల్ అదుపుతప్పి కిందపడి మృతి చెందాడు. పనిమీద మంగళవారం మోటార్ సైకిల్ పై ఇల్లెందు వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామ సమీపంలోని మూల మలుపు వద్ద బైకు అదుపు తప్పడంతో కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో సీతారాములు తలకు గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సరోజ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.