ఖమ్మం : ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓ.పీ.డి.ఆర్) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు , ఖమ్మం జిల్లా కన్వీనర్ బాణాల లక్ష్మణాచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఓపిడిఆర్ రాష్ట్ర కమిటీ సభ్యులు దందా లింగయ్య మాట్లాడుతూ 1977వ సంవత్సరంలో ఓపిడిఆర్ ఖమ్మం జిల్లా శాఖ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజా ఉద్యమాలపై, ప్రభుత్వ నిర్భంద అణచివేతలకు వ్యతిరేకంగా, ప్రజల ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకోసం శక్తి వంచన లేకుండా పోరాడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగానే నాలుగో జిల్లా మహాసభలను ఖమ్మం పట్టణంలోని ఐఎంఏ హాల్లో జనవరి23న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో జరుగుతుందని,మేధావులు పాల్గొని సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వరగాని కోటేశ్వరరావు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ జక్కం శ్రీను , భద్రాద్రి జిల్లా కార్యవర్గ సభ్యులు బొమ్మకంటి మల్లేశం ,ఇల్లందు ఏరియా కమిటీ కన్వీనర్ బాలకృష్ణ , కో- కన్వీనర్ పూనెం కొండలరావు , వైరా నియోజక వర్గం కన్వీనర్ నూనావత్ వీరునాయక్, కొప్పెర వెంకన్న , సోలం నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.