ఖమ్మం, ఫిబ్రవరి 12: మన నీళ్లు, మన హకుల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పోరాడడానికి ప్రజలంతా కదలి రావాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హకులను కాపాడుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ కేసీఆర్ నేతృత్వంలో మంగళవారం నిర్వహిస్తున్న చలో నల్గొండ భారీ బహిరంగ సభకు జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత వైఖరి వల్ల కృష్ణా బేసిన్లోని దక్షిణ తెలంగాణ రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నదీ జలాలను కేఆర్ఎంబీకి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిన నిర్ణయం రైతుల మెడపై గొడ్డలి పెట్టులాంటిదని అన్నారు.