కారేపల్లి, ఫిబ్రవరి 25 : ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివాసం ఉంటున్న బాధితులకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అండగా నిలుస్తున్నారని దిశ కమిటీ మాజీ సభ్యుడు, ఆ పార్టీ నాయకుడు లాకావత్ లక్ష్మణ్ తెలిపారు. బుధవారం కారేపల్లిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. నిలువ నీడ లేని పేదలు ప్రభుత్వ భూముల్లో ఇంఢ్లు కట్టుకుని నివసిస్తుంటే వారి ఆశలను చిదిమివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను నిర్ధక్షణంగా కూల్చివేసిందని విమర్శించారు. బాధితులను కలిసి వారికి అండగా నిలిచేందుకు కేటీఆర్ గురువారం ఖమ్మం పర్యటనకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. బీఆర్ఎస్ సింగరేణి మండల నాయకులు, ప్రజలు కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.