చుంచుపల్లి : కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రధానమంత్రిఓ ధన్ ధన్య కృషి యోజన అనే కార్యక్రమాన్ని శనివారం కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. టి. భరత్ మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆలాగే భూమిలో భూసారం పెంచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమాంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు మాట్లాడుతూ.. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త డా. ఎన్. హేమ శరత్ చంద్ర, ఉద్యాన శాస్త్రవేత్త బి. శివ, డీడీఏ సరితా, మణుగూరు ఏడీఏ తాతారావు, ఎల్లందు ఏడీఏ లాల్ చాంద్, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, 250 మంది రైతులు పాల్గొన్నారు.