HomeKhammamKothagudem Corporate Main Workshop Has Become The Backbone Of Singareni Company By Providing The Essentials For Coal Production And Transportation In Singareni Company
మెయిన్ వర్క్షాప్..
సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి, రవాణాకు అవసరమైన వాటిని అందిస్తూ సింగరేణి సంస్థకు కొత్తగూడెం కార్పొరేట్ మెయిన్ వర్క్షాప్ వెన్నెముకగా నిలిచింది. 85 యేండ్లుగా తన సేవలను కొనసాగిస్తున్నది.
బొగ్గు రవాణాలో కీ రోల్
2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.10 కోట్ల లాభం
1938లో కొత్తగూడెంలో ప్రారంభం.. నేటికీ కొనసాగుతున్న సేవలు
ఇక్కడ ఉత్పత్తి అయ్యే వస్తువులతోనే బొగ్గు రవాణా, ఉత్పత్తి
కొత్తగూడెం సింగరేణి, మే 13 : సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి, రవాణాకు అవసరమైన వాటిని అందిస్తూ సింగరేణి సంస్థకు కొత్తగూడెం కార్పొరేట్ మెయిన్ వర్క్షాప్ వెన్నెముకగా నిలిచింది. 85 యేండ్లుగా తన సేవలను కొనసాగిస్తున్నది. మెయిన్వర్క్షాప్ ప్రాముఖ్యత ఇప్పటివరకు కార్మికులు, సింగరేణి కుటుంబీకులకు పూర్తిగా తెలియదు. ముఖ్యంగా బొగ్గు ఉత్పత్తి, రవాణా అంటే సింగరేణి కార్మికులు, అధికారులతో పాటు ఓపెన్కాస్ట్ మైన్లలో డంపర్లు, సీహెచ్పీల్లో బొగ్గు రవాణా చేసే కన్వేయర్ బెల్టులు మాత్రమే కనిపిస్తుంటాయి. కానీ భూగర్భ గనులు, ఓపెన్కాస్ట్ ప్రాజెక్టుల్లో అయినా బొగ్గు ఉత్పత్తి, రవాణా జరగాలంటే మెయిన్ వర్క్షాప్లో ఉత్పత్తి అయ్యే వస్తువులు కీలకపాత్ర పోషిస్తున్నాయి.
1938లో ప్రారంభం..
1938లో కొత్తగూడెం కార్పొరేట్లో స్థాపించిన మెయిన్ వర్క్షాప్లో అప్పుడు బొగ్గు ఉత్పత్తికి అవసరమైన హాలర్స్, బొగ్గు టబ్బులు, లాడీస్ పయ్యలు, కప్లింగ్స్, క్రాస్ బేరింగ్స్, టబ్ క్లాంప్స్, షిస్ప్లేట్స్ ఉత్పత్తి చేసేవారు. వీటిద్వారా భూగర్భగనుల్లో తట్టాఛమ్మాస్తో బొగ్గు ఎత్తి టబ్బుల్లో నింపి వాటిద్వారా బొగ్గును పైకి తెచ్చేవారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం సింగరేణి సంస్థలో కూడా ప్రవేశించింది. తద్వారా తట్టాఛమ్మాస్ మాయమై ప్రస్తుతం మిషన్ మైనింగ్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. అండర్గ్రౌండ్ మైన్లలో కూడా బీజీ ప్యానల్, లాంగ్వాల్ మై న్స్, సీఎంఆర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేసి ఎల్హెచ్డీ, హెచ్డీఎల్ ద్వారా బొగ్గును బంకర్లలో నింపి బెల్టు ద్వారా పైకి తీసుకొచ్చి సీహెచ్పీలకు సరఫరా చేస్తున్నారు.
ఓపెన్కాస్ట్ మైన్లలో కూడా షావల్ ద్వారా డంపర్లను నింపి సమీపంలో ఉన్న క్రషర్లో అన్లోడ్ చేస్తే అక్కడి నుంచి సీహెచ్పీకి బెల్టు ద్వారా బొగ్గు రవాణా జరిగి అవసరమైన కంపెనీలకు లారీలు లేదా రైల్వే మార్గం ద్వారా బొగ్గు రవాణా చేస్తుంటారు. ఈ బొగ్గు రవాణాకు అవసరమైన యంత్రసామగ్రిని కొత్తగూడెం మెయిన్ వర్క్షాప్ ద్వారానే త యారు చేస్తుంటారు. ప్రస్తుతం ఈ మెయిన్ వర్క్షాప్లో కన్వేయర్ రోలర్స్ ఫేమ్స్, డబ్ల్యూ స్టాఫ్స్, డ్రంబ్ రోలర్స్, ఫిష్ప్లేట్స్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ వర్క్షాప్లో ఉత్పత్తి అయ్యే వస్తువులు అండర్గ్రౌండ్ మైన్లో బొగ్గు ఉత్పత్తి సమయంలో రూఫ్ ఫాల్ కా కుండా సపోర్టు చేసే రూఫ్ బోలట్స్కు సపోర్టుగా ఫిష్ ప్లేట్స్ ఉపయోగపడతాయి. యూ జీమైన్స్, ఓపెన్కాస్ట్లలో ఉత్పత్తి అయిన బొగ్గు ఆయా ఏరియాల సీహెచ్పీల్లోని బంకర్లకు వస్తుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన లారీల ద్వారా, రైల్వే మార్గాన వ్యాగన్ల ద్వారా బొగ్గు రవాణా సాగుతుంది. ఈ కన్వేయర్ బెల్టు నడవాలంటే బెల్టు కింద కన్వేయర్ రోలర్ ఫేమ్స్, డ్రమ్ రోలర్స్ ఉపయోగపడతాయి. వాటిద్వారానే బొగ్గు రవాణా సులభంగా మారుతుంది.
రాష్ట్ర ఏర్పాటుతో మహర్దశ..
రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్రా పాలకులు వర్క్షాప్లను మూసివేసే కుట్రల్లో భాగంగా కార్మికులను పూర్తి స్థాయిలో తగ్గించి అవసరమైన పనిముట్ల కొనుగోళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు యత్నించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణిలోని వర్క్షాప్లకు జీవం పోసినైట్లెంది. వర్క్షాప్లను మూసివేయకుండా సింగరేణి వ్యాప్తంగా ఉన్న కొత్తగూడెం ఏరియా (సత్తుపల్లి), ఇల్లెందు ఏరియా, మణుగూరు ఏరియా, రామగుండం 1,2,3 ఏరియాలు, మందమర్రి, బెల్లంపల్లి, భూపాలపల్లి, శ్రీరాంపూర్ ఏరియాలతో పాటు సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్స్ (ఎస్టీపీపీ)కి, గోదావరిఖనిలోని ఏఎల్పీకి కూడా ఈ వర్క్షాప్ నుంచి యంత్ర సామగ్రిని సరఫరా చేస్తున్నారు. పెద్దపెద్ద యంత్రాల నుంచి చిన్నపాటి యంత్రాల వరకు అవసరమైన స్పేర్పార్ట్స్ను తయారు చేసి అందిస్తున్నారు. 85 యేండ్లుగా సేవలు అందిస్తున్నా ఇందులో ఉత్పత్తి అయ్యే సామగ్రి పూర్తి వివరాలు ఇప్పటి వరకు బయటికి తెలియకపోవడం గమనార్హం. ఈ వర్క్షాప్ కనిపించని నాలుగో సింహంలా సింగరేణి సంస్థకు వెన్నెముకలా నిలబడి బొగ్గు రవాణాలో ప్రముఖ భూమిక పోషిస్తున్నది. కాగా, ఈ ఏడాది లక్ష్యాన్ని అధిగమించి ఉత్పత్తి చేయడం వల్ల రూ.10 కోట్లకు పైగా లాభాలు ఆర్జించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.10.46 లక్షల లాభాన్ని పొందింది.
డైరెక్టర్ ప్రోత్సాహంతో లాభాల బాట..
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ వర్క్షాప్లో ప్రతి ఏడాది ఉత్పత్తిని పెంచుతూ వస్తున్నారు. అక్టోబర్ 2020లో బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణరావు దిశానిర్దేశం, సూచనలతో ముడి సరుకును సరైన సమయానికి సమకూర్చడంతో అనుకున్న లక్ష్యాన్ని అధిగమించి లా భాలు ఆర్జిస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్ (ఈఅండ్ఎం) వర్క్షాప్లో పర్యటించినప్పుడు ఐటమ్స్ ఉత్పత్తిని అనుకున్న సమయానికి తయారు చేయాలంటే అక్కడ అవసరమైన యంత్రాలు కూడా ఉండాలని గు ర్తించారు. రూ.40 లక్షల విలువైన సీఎన్సీ (కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్) లేక్ మిషన్ను ఏర్పాటు చేయించారు.
పుంజుకున్న ఉత్పత్తి
మెయిన్ వర్క్షాప్లో మందకొడిగా సాగేది. ఉత్పత్తి డైరెక్టర్ ఈఅండ్ఎం సత్యనారాయణరావు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన సూచనలు, సలహాలతో సెంట్రల్ వర్క్షాప్ జీఎం (ఈఅండ్ఎం) ఎల్వీ గణపతిరావు పర్యవేక్షణలో ఉత్పత్తి, ఉత్పాదకత పుంజుకుంది. గత ఏడాది రూ.34.67 కోట్ల విలువైన ఉత్పత్తి చేయగా.. రూ.10.46 కోట్ల లాభాలను ఆర్జించింది. అధికారుల పర్యవేక్షణ, అవసరమైన ముడి సరుకు సమయానికి ఏర్పాటు చేయడం వల్ల వారి ప్రోత్సాహంతో కార్మికులు కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. సంస్థ వ్యాప్తంగా సీహెచ్పీలకు అవసరమైన ఉత్పత్తిని, లక్ష్యాన్ని అధిగమించి చేస్తున్నారు. ఇదే ఒరవడితో ముందుకుసాగి వర్క్షాప్ మరింత లాభాలు ఆర్జించేలా సమష్టి కృషి చేసేందుకు అందరం సిద్ధంగా ఉన్నాం.