ఖమ్మం :తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, స్వాతంత్య్ర సమరయోధులు కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను సోమవారం ఖమ్మంలోని తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, కార్యాలయ ఇన్ఛార్జి ఆర్జేసి కృష్ణ, నగర అద్యక్షులు పగడాల నాగరాజు, మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి ప్రసన్న, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారాలు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.