ఖమ్మం: ఖమ్మం జిల్లా ఆర్టీసీ రీజియన్ లో కరోనా కలకలం రేగింది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కరోనా సోకింది. వారం రోజులవ్యవధిలో ఖమ్మం రీజియన్ పరిధిలో 38 మందికి పైగా డ్రైవర్లు, కండక్టర్లు కరోనా బారిన పడ్డారు. వీరికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలిందని అధికారులు తెలిపారు.
పండుగ సెలవుల్లో నెలకొన్నరద్దీతో వారు కరోనా బారిన పడ్డారు. ఖమ్మం డిపో పరిధిలో 21,కొత్తగూడెం7,భద్రాచలం4,మధిర3,సత్తుపల్లిలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు.