కూసుమంచి, జూన్ 18: రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన వద్దిరాజు రవిచంద్ర, బండి పార్ధసారథి రెడ్డికు శనివారం జిల్లా సరిహద్దులో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఎంపీ నామా నాగేశ్వరరావు ఎంపీల వెంటరాగా, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, కార్యకర్తలు, నాయకులు జిల్లా సరిహద్దు నాయకన్గూడెం వద్దకు ఎంపీలకు స్వాగతం పలికారు. ఇంటూరి శేఖర్, రామసహాయం బాలకృష్ణారెడ్డి, బానోత్ శ్రీనివాస్, వడ్త్యి సేట్రాం నాయన్, పద్మారెడ్డి, వజ్జా రమ్య, బోడా మంగీలాల్, వేముల వీరయ్య, ఉన్నం బ్రహ్మయ్య, నాయకులు మల్లీడి వెంకటేశ్వర్లు, కంచర్ల వీరారెడ్డి, కాసాని సైదులు, రామసహాయం వెంకటరెడ్డి, రవి, సుధాకర్రెడ్డి, వీరభద్రం ఎంపీలకు స్వాగతం పలికారు.
మధిరటౌన్, జూన్ 18: రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి అభినందన, సన్మానసభకు జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు నాయకత్వంలో టీఆర్ఎస్ నాయకులు భారీగా తరలివెళ్లారు. చిత్తారు నాగేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్, జూన్ 18: ఖమ్మం నగరంలో జరిగిన కృతజ్ఞత సభకు మండలం నుంచి టీఆర్ఎస్ నాయకులు అభిమానులు పెద్దఎత్తున తరలివెళ్లారు. వాహనాల ర్యాలీని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, ఎంపీపీ ఉమాతో కలిసి ప్రారంభించారు. సుడా డైరక్టర్ గూడా సంజీవరెడ్డి, బానోత్ మోహన్, ఉదయ్ పాల్గొన్నారు.
చింతకాని, జూన్ 18: జిల్లా కేంద్రంలో చేపట్టిన కృతజ్ఞతా సభకు గ్రామాల నుంచి సుమారు 1000 ద్విచక్ర వాహనాలు, 50 ప్రైవేటు వాహనాల్లో నాయకులు, కార్యకర్తలు ఖమ్మం తరలివెళ్లారు.
బోనకల్లు, జూన్ 18: రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి అభినందన సభకు శనివారం టీఆర్ఎస్ మండల శ్రేణులు పెద్దఎత్తున ఖమ్మం తరలివెళ్లారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు సారథ్యంలో 22 గ్రామాల నుంచి తరలివెళ్లారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
నేలకొండపల్లి, జూన్ 18: రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై మొదటిసారిగా జిల్లాకు వస్తున ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డికి స్వాగతం పలికేందుకు నేలకొండపల్లి నుంచి టీఆర్ఎస్ శ్రేణులు శనివారం భారీగా తరలివెళ్లారు. ఉన్నం బ్రహ్మయ్య, వజ్జా రమ్య, నెల్లూరి లీలాప్రసాద్, వెన్నబోయిన శ్రీను, వెన్నపూసల సీతరాములు, శాకమూరి రమేశ్, కాసాని నాగేశ్వరరావు, ఎర్రబోయిన నర్సయ్య, కొమ్మూరి నరేశ్, కడియాల నరేశ్, తేజావత్ కోటేశ్వరరావు, కళ్లెం కృష్ణారెడ్డి, వజ్జా శ్రీనివాసరావు, భూక్యా సుధాకర్ పాల్గొన్నారు.
ఎర్రుపాలెం, జూన్ 18: రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జిల్లాకు వస్తున్న వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డికి స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు ఆధ్వర్యంలో శ్రేణులు, నాయకులు శనివారం ఖమ్మం తరలివెళ్లారు. చావా రామకృష్ణ, పంబి సాంబశివరావు, దేవరకొండ శిరీష, రామకోటయ్య, శ్రీనివాసరెడ్డి, యరమల భాస్కర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, కిశోర్బాబు, రవి, పవన్, హుస్సేన్, సుధీర్, రాము తదితరులు పాల్గొన్నారు.