ఖమ్మం :మధ్యప్రదేశ్ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో భోపాల్ నగరం బహరీలో జరగనున్న 30వ సీనియర్ జాతీయ స్థాయి ఉషు చాంపియన్ షిప్ పోటీలకు ఖమ్మంలోని సర్ధార్ పటేల్ స్టేడియం క్రీడాకారులు ఎంపికయ్యారు. సీనియర్ పురుషుల విభాగంలో పీ సత్యజిత్ చారి, మహిళల విభాగం నుంచి జీ మేఘన వెళ్లనున్నారు. కాగా వారిని జిల్లా యువజన, క్రీడల అధికారి ఎం పరంధామరెడ్డి, కోచ్ పూర్ణాచారి అభినందించారు.