ఖమ్మం, జనవరి 27: రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్ర, శనివారాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా శుక్రవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. ఇక్కడి ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన క్యాథ్ల్యాబ్, ట్రామాకేర్ యూనిట్లను ప్రారంభిస్తారు. 10:45 గంటలకు ఖమ్మం జడ్పీ మీటింగ్ హాల్లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల వైద్యారోగ్య, ఆడిట్, ట్రెజరీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎన్ఎస్పీ అతిథి గృహం లో భోజనం చేస్తారు. 2 గంటలకు ఖమ్మం నుంచి బయలుదేరి 2:45కు మధిర చేరుకుంటారు. ఆ మండలంలోని ఆత్కూరు గ్రామంలో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 3:10 గంటలకు మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాల దగ్గరలో 100 బెడ్ల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5 గంటలకు సత్తుపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 100 బెడ్ల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 5:30 గంటలకు సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రా మంలో షిరిడీసాయి హాస్పిటల్ను ప్రారంభిస్తారు. రాత్రి సత్తుపల్లిలోనే బస చేస్తారు. శనివారం ఉదయం 8 గంటలకు సత్తుపల్లిలో బయలుదేరి 9 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. రామవరంలో నిర్మించిన 100 బెడ్ల ఎంసీహెచ్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. 9:45 గంటలకు పాల్వంచలోని నవభారత్ వద్దకు చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న నూ తన నర్సింగ్, మెడికల్ కళాశాలల పనులను పరిశీలిస్తారు. 10:15 గంటలకు పాల్వంచ నుంచి బయలుదేరి మధ్మాహ్నం ఒంటిగంటకు సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకుంటారు.