కొత్తగూడెం, జూలై 10: భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా శనివారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం మొదలైన వాన సాయంత్రం వరకు కొనసాగింది. ఏక ధాటిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాకేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో జనావాసాల్లోకి వరద నీరు చేరింది. కొత్తగూడెంలోని మొర్రేడువాగు, రామవరంలోని గోధుమ వాగు పొంగి పొర్లాయి. చుంచుపల్లి, జూలూరుపాడు, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లిలో వాన ఉధృతి ఎక్కువగా కనిపించింది. జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షపాతం 295.4 మి.మీ కాగా సగటున 17.4 మి.మీ నమోదైంది. అశ్వాపురంలో అత్యధికంగా 101.6 మి.మీ, పినపాక 15.8, చర్ల 1.4, దుమ్ముగూడెంలో 25.2, మణుగూరు 8.0, గుండాల 7.8, జూలూరుపాడు 51, చండ్రుగొండ 8.6, కొత్తగూడెం 34.6, పాల్వంచ 2.6, భద్రాచలం 14.8, ములకలపల్లి 5.2, దమ్మపేట 11.2, అశ్వారావుపేటలో 10.6త మి.మీ వర్షం కురిసింది.