పెనుబల్లి, సెప్టెంబర్ 18 : సూరయ్యబంజరు, అడవిమల్లెల, కొండ్రుపాడు, అగ్రహారం గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి చిత్రపటాల వద్ద ఎమ్మెల్యే సండ్ర ఆదివారం నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన వెంట నాయకులు కనగాల వెంకటరావు, చెక్కిలాల మోహన్రావు, లక్ష్మణ్రావు, పసుమర్తి వెంకటేశ్వరరావు, మందడపు అశోక్కుమార్ తదితరులు ఉన్నారు.
దివ్యాంగుడికి ఎమ్మెల్యే భరోసా : అధైర్యపడకు, దివ్యాంగుడివైన నీకు అండగా నేనుంటా, అన్ని విధాలా ఆదుకుంటానంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దివ్యాంగుడికి భరోసా కల్పించారు. కేడబ్ల్యూ చౌడవరంలో ఆదివారం నూతన పింఛన్ కార్డులు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర దివ్యాంగుడితో మాట్లాడాడు.