పెనుబల్లి, సెప్టెంబర్ 18: తెలంగాణలో ప్రతి ఇంటి పెద్దన్నలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచిపోతున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. దేశంలోకెల్లా అత్యుత్తమ పాలన అందుతున్నది. తెలంగాణలో మాత్రమేనని స్పష్టం చేశారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. మండలంలోని అడవిమల్లేల, కోండ్రుపాడు, సూరయ్యబంజరు తండా, అగ్రహారం, కేడబ్ల్యూ చౌడవరం గ్రామాల్లో మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం ఆయన లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం, గిరిజనులకు రిజర్వేషన్ పెంచడం, వారి ఆత్మగౌరవ భవనాలను ప్రారంభించడం, పోడు భూముల పరిష్కారానికి జీవో జారీ చేయడం వంటివి ఎంతో గొప్ప విషయాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు చెక్కిలాల మోహన్రావు, కనగాల వెంకటరావు, చెక్కిలాల లక్ష్మణ్రావు, పసుమర్తి వెంకటేశ్వరరావు, చింతనిప్పు సత్యనారాయణ, ముక్కర భూపాల్రెడ్డి, మందడపు అశోక్కుమార్, చీకటి రామారావు, బెల్లంకొండ చలపతిరావు, కోట ప్రభాకర్, మరకాల చంటి, భూక్యా ప్రసాద్, వంగా నిరంజన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.