ఖమ్మం, సెప్టెంబర్ 8: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పలు పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులు, వైద్యులు, జర్నలిస్టులు తదితరులు అధిక సంఖ్యలో హాజరై మంత్రి పువ్వాడకు శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా శ్రీఅష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో చేపట్టిన విజయ ధనలక్ష్మి హోమంలో మంత్రి అజయ్కుమార్, వసంతలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
మంత్రిని సత్కరిస్తున్న సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్
అనంతరం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలంయలో ప్రముఖులందరూ ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు. మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ తదితరులు మంత్రికి శాలువాలు కప్పి సత్కరించారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి తదితరులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
టీఆర్ఎస్ యువజన విభాగం నగర అధ్యక్షుడు దేవభక్తిని కిశోర్, ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్కుమార్, ఉపాధ్యక్షుడు సరిపూడి గోపి సందేశ్, మహ్మద్ తౌసిఫ్, బలుసు మురళీకృష్ణ తదితరులు కూడా బొకేలు అందజేసి విషెస్ చెప్పారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ అఫ్జల్హసన్, ఆర్వీఎస్ సాగర్ అధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు మంత్రికి శుభాకాంక్షలు చెప్పి కేక్ కట్ చేయించారు. నాయకులు బాగం పవన్, చుంచు వీరనారాయణ, నందగిరి శ్రీను, దాసరి రవికుమార్, శాబాసు జ్యోతి, స్వప్న తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టు సంఘాల నాయకులు రాంనారాయణ, వనం వెంకటేశ్వర్లు, మైసా పాపారావు, వెంకట్రావు, ఆదినారాయణ తదితరులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రికి వేదాశీర్వచనం..
భద్రాచలం, సెప్టెంబర్ 8 : రాష్ట్ర రవాణా శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తైన సందర్భంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం అర్చకులచే గురువారం ఖమ్మంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో వేదాశీర్వచనం, భద్రాద్రి రామయ్య ప్రసాదాలను అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భద్రాచలం అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే గోదావరి ప్రాంత నిర్వాసితులకు ప్రకటించిన అన్ని హామీలు నెరవేర్చబోతున్నామని, భద్రాద్రి రామయ్య కరుణా, కటాక్షాలతో 2016కుటుంబాలకు కాలనీలు నిర్మిస్తామన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ను భద్రాచలంలో పర్యటనకు తీసుకు వస్తామని చెప్పారు. కార్యక్రమంలో దుమ్ముగూడెం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అన్నెం సత్యాలు, ఆర్టీఐ డైరెక్టర్ గూడపాటి శ్రీనివాస్రావు, సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు అలీంఖాన్, భద్రాచలం టీఆర్ఎస్ అధికార ప్రతినిధి బల్లా రాంబాబు, చర్ల మండల నాయకుడు కుమార రాజా తదితరులు పాల్గొన్నారు.