ఎర్రుపాలెం, జూన్ 26: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు ప్రత్యేక పూజలు చేశారు. మండల పర్యటనలో భాగంగా స్వామివారి ఆలయానికి చేరుకున్న వారికి.. దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వారికి స్వామివారి శేషవస్ర్తాలు బహూకరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
బొర్రా సుబ్బారావు విగ్రహావిష్కరణ..
మండలంలోని రేమిడిచర్ల గ్రామానికి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి బొర్రా సుబ్బారావు వర్ధంతి సభలో ఎంపీలు పాల్గొన్నారు. వారి కుటుంబసభ్యులు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సుబ్బారావు సేవలను కొనియాడారు. స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు చిత్తారు నాగేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, దేవరకొండ శిరీష, శీలం కవిత, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మూల్పూరి స్వప్న, పురుషోత్తంరాజు, మొగిలి అప్పారావు, శైలజ, అప్పమ్మ, మూల్పూరి శ్రీనివాసరావు, రామకోటయ్య, తుల్లూరి కోటేశ్వరరావు, చావా రామకృష్ణ, పంబి సాంబశివరావు, కొండేపాటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.