మామిళ్లగూడెం, జూన్ 14 : అనారోగ్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) ఒక వరమని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. మధిర నియోజకవర్గంలోని ముదిగొండ, బోనకల్, చింతకాని మండలాలకు చెందిన 33మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.9,21,500 విలువైన చెక్కులను మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రుల్లో వైద్యం కోసం డబ్బులు ఖర్చు చేసిన కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి నుంచి చేయూతనందిస్తున్నట్లు తెలిపారు. ముదిగొండ మండలంలో 12చెక్కుల ద్వారా రూ.3,87,500, చింతకాని మండలంలో 15చెక్కుల ద్వారా రూ.3,62,500, బోనకల్ మండలంలో 6చెక్కుల ద్వారా రూ.1,71,500లను లబ్ధిదారులకు అందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.