బోనకల్లు, జూన్14 : ముష్టికుంట్ల, రాపల్లె, ఆళ్లపాడు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మాజీఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో సీఎంరిలీఫ్ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు సీఎంరిలీఫ్ఫండ్ చెక్కుల ద్వారా కొంతమేర ఆర్థిక సాయం అందిస్తున్నదన్నారు.కార్యక్రమంలో మండల కార్మికశాఖ అధ్యక్షుడు బంధం నాగేశ్వరరావు, నాయకులు షేక్ హుస్సేన్, పాపినేని కృష్ణ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
చింతకాని, జూన్ 14 : నిరుపేదలకు సీఎం సహాయనిధి వరం లాంటిదని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. చింతకాని మండలానికి చెందిన 15 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించి మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పీటీ కిశోర్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కిలారు మనోహర్, జిల్లా సభ్యుడు మంకెన రమేశ్, నాయకులు బొడ్డు వెంకట్రామారావు, నల్లమోతు శేషగిరి, గడ్డం శ్రీను, బంధం కృష్ణ, తాళ్లూరి బాలాజి తదితరులు పాల్గొన్నారు.