సుజాతనగర్, సెప్టెంబర్ 21: జిల్లాలోని సుజాతనగర్ మండలం చిమ్నాతండా పంచాయతీలో నూరుశాతం వ్యాక్సినేషన్ పూర్తికావడంపై భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందిని అభినందించారు. ఈ గ్రామం మన జిల్లా కీర్తి ప్రతిష్ఠలను దేశస్థాయిలో నిలిపిందని ప్రశంసించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ నూరుశాతం పూర్తయిన సందర్భంగా గ్రామంలో మంగళవారం ఏర్పాటుచేసిన అభినందన సభలో కలెక్టర్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి ప్రభుత్వ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారం వల్లే మారుమూల ప్రాంతమైన చిమ్నాతండాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని అన్నారు.
ఈ గ్రామాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలే వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ఆశ, అంగన్వాడీ, వైద్య, కార్యదర్శి, సర్పంచ్ శాలువతో సన్మానించారు. అనంతరం సింగభూపాలెం పంచాయతీని ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. తరువాత సింగభూపాలెం చెరువు కట్టను పరిశీలించారు. ఎంపీపీ భూక్యా విజయలక్ష్మి, తహసీల్దార్ సునీల్రెడ్డి, ఎంపీడీవో వెంకటలక్ష్మి, ఆర్అండ్బీ ఈఈ భీమ్లా, డీఈ నాగేశ్వరరావు, డాక్టర్ నాగమణి, సర్పంచ్ హేమ కృష్ణచైతన్య పాల్గొన్నారు.