మణుగూరు రూరల్, మే 17: ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు సూచించారు. అనాథ పిల్లలకు, బాలల సదనంలోని చిన్నారులకు ఆసరాగా నిలిచి వారిపట్ల మానవతా దృక్పథాన్ని చాటుకోవాలని కోరారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సహకారంతో దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమం శివలింగాపురంలో జరగ్గా ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. బాలల సదనానికి వస్తువులు, 40 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు వితరణ అందించిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) సురేశ్ నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. తొలుత నూతనంగా ఏర్పాటు చేసిన బాలల సదనంలో బెడ్లు, టివీలు ఉన్న గదిని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ బాలల సదనాన్ని అందంగా తీర్చిదిద్దాలని సూచించారు.
ట్రైబుల్ కమ్యూనిటీ హాల్ పరిశీలన..
అనంతరం మండలంలోని సమితిసింగారం గ్రామంలో ఉన్న ట్రైబుల్ కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే రేగా కాంతారావు, కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. డిజిటల్ లైబ్రరీకి అవసరమయ్యే ఫర్నీచర్తోపాటు కావాల్సిన సౌకర్యాలపై చర్చించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో రూ.కోటితో నిర్మించనున్న లైబ్రరీ స్థలాన్ని పరిశీలించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు వరలక్ష్మి, నాగరాజు, విజయకుమారి, గుమ్మడి గాంధీ, వీరబాబు, సైదుల్రెడ్డి, మాధవి, జయలక్ష్మి, ప్రమీల, ధనలక్ష్మి, జావీద్పాషా, హబీబ్, గుడిపూడి కోటేశ్వరరావు, వట్టం రాంబాబు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, రమాదేవి, బోశెట్టి రవి, సృజన్ తదితరులు పాల్గొన్నారు.