సుజాతనగర్, మే 16:దేశంలో అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. మండలంలో రూ.13 కోట్లతో నిర్మిస్తున్న డబుల్రోడ్ పనులు, హైలెవల్ వంతెన పనులకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో అక్కడి ప్రజలు నీళ్లు, కరెంట్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదే విధంగా దేశంలో 28 రాష్ర్టాల్లో ఏ రాష్ట్రమూ అభివృద్ధి చెందని విధంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని, నంబర్వన్ స్థానంలో ఉందని గుర్తుచేశారు. రాష్ట్రంలో సాగు, తాగు నీటికి ఎలాంటి ఢోకా లేదన్నారు. తెలంగాణలో తప్ప దేశంలోని అన్ని రాష్ర్టాల్లోనూ కరెంట్ సమస్యలు ఉన్నాయన్నారు. తెలంగాణ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. అలాంటి పార్టీల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు.
రూ.40 కోట్లతో అభివృద్ధి పనులు: వనమా
ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను, తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న వివక్షను ఎంపీ నామా నాగేశ్వరరావు పార్లమెంట్లో ఎండగడుతున్నారని గుర్తుచేశారు. సుజాతనగర్ మండలాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానని అన్నారు. మండలంలో దాదాపు రూ.40 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశామన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు దిండిగాల రాజేందర్, కంచర్ల చంద్రశేఖర్రావు, బిందుచౌహాన్, కాపు సీతాలక్ష్మి, బాదావత్ శాంతి, భూక్యా రాంబాబు, బత్తుల వీరయ్య, మండె వీరహన్మంతరావు, బాగం మోహన్రావు, లింగం పిచ్చిరెడ్డి, కొట్టి వెంకటేశ్వర్లు, అనిత రామనాథం, దామోదర్ యాదవ్, బత్తుల మానస, పెద్దమళ్ల శోభారాణి, మూడ్ గణేశ్, సీకా కృష్ణవేణి, చైతన్య, తుర్సం సీత, సాంబయ్య, బలరాం నాయక్, కౌన్సిలర్లు పరమేశ్యాదవ్, వేముల ప్రసాద్, సంకుబాపన అనుదీప్, బత్తుల కేశవరావు, రమేశ్, తులసీరెడ్డి, అమృతరావు, సీతారామయ్య, తుంపురి రాములు, బాల్రెడ్డి, శ్యాంరెడ్డి, చుక, తిట్ల భాస్కర్, యూసుఫ్, సైదుబాబు, సాంబయ్య, సామ్యా నాయక్, భీమా శ్రీధర్, రావి రాంబాబు, మసూద్, సుందర్రాజ్, వశ్యా నాయక్, రవీందర్, తొగరు రాజశేఖర్, మాదా శ్రీరాములు, శేషాద్రి వినోద్, రాములు, చిమట నాగేశ్వరరావు, ఇస్తరియా, నున్నా వెంకన్న, లక్ష్మీనారాయణ, చంద్రగిరి కొండలు, కిన్నెర వెంకన్న, రాములు పాల్గొన్నారు.