ఖమ్మం, జనవరి 27: టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన తాతా మధుసూదన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అభినందించారు. హైదరాబాద్లోని మంత్రి పువ్వాడ అధికారిక నివాసంలో తాతా మధు గురువారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాతా మధుకు మంత్రి అజయ్ పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ను తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చేందుకు మరింత కృషి చేయాలని సూచించారు. కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
నూతన అధ్యక్షులకు మంత్రి శుభాకాంక్షలు..
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు నూతనంగా నియమించిన పార్టీ అధ్యక్షులు తాతా మధు, రేగా కాంతారావులకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అధినేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని, పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.