సత్తుపల్లి, జనవరి 26 : మండల, పట్టణ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కార్యాలయం వద్ద 100 అడుగుల జాతీయ జెండాను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సుజాత, గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, గంగారం 15వ బెటాలియన్లో కమాండెంట్ సయ్యద్ జమీల్పాషా, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో నాల్గవ అదనపు జిల్లా జడ్జి సీవీఎస్.సాయిభూపతి జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ సమాజంలో సాంఘిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను పారదోలి ప్రతి ఒక్కరూ చైతన్యవంతమై అభివృద్ధిలో ముందుండాలని ఆకాంక్షించారు. కార్యక్రమాల్లో పీఆర్డీఈ నళినీమోహన్, ఆత్మచైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, నాయకులు చల్లగుళ్ల నర్సింహారావు, గోగులమూడి బాలాజీరెడ్డి, మందపాటి వెంకటరెడ్డి, తుమ్మూరు కృష్ణారెడ్డి, మోదుగు పుల్లారావు, వీరపనేని బాబి, జువ్వాది అప్పారావు, మాధురి మధు, రఫీ, మల్లూరు అంకమరాజు, దొడ్డాకుల గోపాలరావు, షేక్ చాంద్పాషా, పవన్లతో పాటు కౌన్సిలర్లు, బెటాలియన్లో అదనపు సహాయ దళాధిపతులు అనిల్కుమార్, ఉదయ్భాస్కర్, నాగేశ్వరరావు, పీఆర్వో సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.