కామేపల్లి, జూలై 27 : ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. తహసీల్దార్ దారా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నూతన కార్డులను లబ్ధిదారులకు మంగళవారం పంపిణీ చేసి మాట్లాడారు. నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, ప్రతి ఒక్కరికీ కడుపు నిండా అన్నం పెట్టడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అదే విధంగా వర్షపాత ఆధారిత ప్రాంత అభివృద్ధి పథకం కింద సాతానిగూడెం గ్రామ రైతులకు హార్టికల్చర్ విభాగం కింద దుక్కి ఖర్చులకు రూ.20 వేల చొప్పున రైతులకు చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ సునీత, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబుయాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంతోటి అచ్చయ్య, ఎంపీడీవో సీలార్ సాహెబ్, ఏవో తారాదేవి, సర్పంచు, ఎంపీటీసీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.