పెనుబల్లి, డిసెంబర్ 19: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఇక ఉండవని, రైతులు ఆత్మగౌరవంతో బతికేలా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి పెనుబల్లి మండలం పాతకుప్పెనకుంట్ల ఆయిల్పాం నర్సరీలో రైతులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్పాం విత్తనాలు ప్రపంచంలో మూడు దేశాల్లోనే ప్రయోగాత్మకంగా తయారుచేయడం వల్ల విత్తనాల కొరత ఉందని, అయినప్పటికీ సీఎం కేసీఆర్ రైతులకు అనేక రకాల సబ్సిడీలు అందించి ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. గత 33 ఏళ్లుగా ఆయిల్పాం సాగులో ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి 8ఏళ్లలోనే సీఎం కేసీఆర్ సాధించారని, గతంలో 33వేల ఎకరాలు సాగులో ఉంటే ప్రస్తుతం 1,24,000 ఎకరాలు సాగు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ బతికున్నంత వరకు రైతుబంధు ఆగదని, రైతులను కంటికి రెప్పలా కాపాడుతున్న రైతుబంధువు కేసీఆరేనని పేర్కొన్నారు.
ఈ నెల 28వ తేదీ నుంచి అరెకరం ఉన్న రైతు నుంచి జనవరి 15 వరకు రూ.7600 కోట్లను రైతు ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషి వల్ల నేను వ్యవసాయం చేయగలను అనే నమ్మకం రైతులందరికీ కలిగిందని అన్నారు. నూతన వ్యవసాయంపై మొగ్గు చూపాలని, మెళకువలు చూపాలని కోరారు. రైతులు ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. వ్యవసాయరంగంలో రాష్ర్టాన్ని నంబర్వన్ స్థానంలో ఉంచిన ఘనత కేసీఆర్దేనన్నారు. ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీడుభూములుగా ఉన్న తెలంగాణ ఆయిల్పాం సాగుతో పచ్చని మైదానంగా మారిందని అన్నారు.
ఆయిల్పాం మొక్కలను ఎగ్జిబిషన్లో చూడడమే తప్ప నేరుగా చూసిన రోజులు ఉండేవికావని, అలాంటిది మన ప్రాంతంలోనే నర్సరీని ఏర్పాటు చేసుకోవడం అద్భుతమన్నారు. అతిత్వరలో ఖమ్మం జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉద్యానవన జిల్లా అధికారి అనసూర్య, ఆయిల్పాం జిల్లా అధికారి బాలకృష్ణ, ఎంపీపీ లక్కినేని అలేఖ్య, సర్పంచ్ మామిడి మైసయ్య, ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్రావు, పాతకారాయిగూడెం సొసైటీ చైర్మన్ చింతనిప్పు సత్యనారాయణ, సీడీసీ చైర్మన్ ముక్కర భూపాల్రెడ్డి, ఎంపీడీవో కావూరి మహాలక్ష్మి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకటరావు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మందడపు అశోక్కుమార్, లక్కినేని వినీల్, కనగాల సురేశ్బాబు, కాకా సీతారాములు, కోమటి ప్రసాద్, ఆళ్ల అప్పారావు పాల్గొన్నారు.