పెనుబల్లి, డిసెంబర్ 18: తెలంగాణ పథకాలను దేశ వ్యాప్తంగా విస్తరించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దైవం లాంటి వారని అన్నారు. మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్థానిక సప్తపది కల్యాణ మండపంలో ఆదివారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో పేదలందరూ ఇబ్బందులు పడకూడదని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ర్టాలకూ ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్ లాంటి మహానాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు లక్కినేని అలేఖ్య, రమాదేవి, చెక్కిలాల మోహన్రావు, చెక్కిలాల లక్ష్మణ్రావు, కనగాల వెంకటరావు, తేజావత్ తావూనాయక్, మందడపు అశోక్కుమార్, పసుమర్తి వెంకటేశ్వరరావు, లక్కినేని వినీల్, చీకటి రామారావు, ముక్కర భూపాల్రెడ్డి, లగడపాటి శ్రీను, తడికమళ్ల తాతారావు, కోమటి ప్రసాద్, తిరుమలశెట్టి నాగదాసు తదితరులు పాల్గొన్నారు.