కూసుమంచి, డిసెంబర్ 11: ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాలుగు సంవత్సరాల్లో సంక్షేమ పాలన సాగిందని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి ఎమ్మెల్యేగా నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసి మాట్లా డారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను నాయకులు, కార్యకర్తలు సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు వేముల వీరయ్య, ఆసిఫ్, ఎంపీటీసీ జర్పుల బాలాజీ, బీఆర్ఎస్ నాయకులు చాట్ల పరశురాం, కొత్తా రాంరెడ్డి, అద్దంకి ఉపేంద్రాచారి, కోటి జాదవ్, తంగెళ్ల బుచ్చిబాబు, వడ్త్యా బాలకృష్ణ, కొక్కిరేణి సీతారాములు, దాసిర బాలకృష్ణ, కొత్తా అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొండబాలకు ఎమ్మెల్యే కందాళ పరామర్శ
కూసుమంచి, డిసెంబర్ 11: రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు సతీమణి రాజేశ్వరి ఇటీవల మృతి చెందారు. ఎమ్మెల్యే కందాళ కొండకొడిమ గ్రామంలో కొండబాల స్వగృహానికి ఆదివారం వెళ్లి రాజేశ్వరి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కొండబాలను పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీలు బానోత్ శ్రీనివాస్, బోడా మంగీలాల్, ఆత్మా చైర్మన్ బాలకృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, సీడీసీ చైర్మన్ నెల్లూరి లీలా ప్రసాద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, నాయకులు వేముల వీరయ్య, పాషబోయిన వీరన్న, ఉన్నం బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
భాస్కర్రావుకు పరామర్శ
ఖమ్మం రూరల్, డిసెంబర్ 11: మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు నల్లపనేని భాస్కర్రావు అనారోగ్యంగా ఉండడంతో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆయన వెంట ఆత్మా చైర్మన్ బాలకృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, నాయకులు దర్గయ్య, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకం : ఎమ్మెల్యే
కూసుమంచి, డిసెంబర్ 11: సమాజాభివృధిలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనదని, వాటిని కాపాడాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. ఆదివారం కూసుమంచిలో టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన పాలేరు డివిజన్ మహాసభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో అల్లిక వెంకటేశ్వరరావు, బానోత్ శ్రీనివాస్, బోడా మంగీలాల్, ఇంటూరి శేఖర్, బెల్లం వేణు, వేముల వీరయ్య పాల్గొన్నారు.