భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ కృషితోనే రాష్ట్రంలో మత్స్య సంపద పెరుగుతోందని, మత్స్యకారులు ఆర్థికంగా దినదినాభివృద్ధి చెందుతున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం చెరువులో సుమారు రూ.7.50 లక్షల విలువైన చేప పిల్లలను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెరువులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు తెలంగాణ సర్కారు భరోసా కల్పిస్తోందని, ఏటా సీజన్లో చేప పిల్లలతోపాటు రొయ్య పిల్లలను కూడా చెరువుల్లో వదులుతున్నామని వివరించారు. పల్లెలను కూడా పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు భూక్యా రాంబాబు, బత్తుల వీరయ్య, మండె వీరహన్మంతరావు, సునీల్రెడ్డి, అనితా రామనాథం, బాగం మోహన్రావు, బత్తుల మానస, పెద్దమళ్ల శోభారాణి, మూడ్ గణేశ్, కృష్ణచైతన్య, కృష్ణవేణి, రవి, హతీరాం, లలిత జేత్రాం, మీరాబాయి, యాకూబ్, అన్వర్పాషా, సూర్య, సాయిలు, లక్ష్మయ్య, వెంకన్న, వీరన్న, మున్నా, రజాక్, సత్యనారాయణ, దామోదర్, యూసుఫ్, యాకూబ్, తులసిరెడ్డి, సత్తిరెడ్డి, దొడ్డి రామకృష్ణ, ఆమ్రు, తిట్ల భాస్కర్, బైరి సాంబయ్య, ఇస్తారయ్య, సైదుబాబు, కిన్నెర వెంకన్న, వనమా రాఘవేందర్రావు తదితరులు పాల్గొన్నారు.