పెనుబల్లి, నవంబర్ 22 : ధాన్యాన్ని విక్రయించే రైతులకు మిల్లర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. లంకాసాగర్లో నిర్మించిన రైస్మిల్లులో మిల్లర్లతో సోమవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైస్మిల్లు కెపాసిటీ, పనిచేసే విధానం, రైతుల నుంచి ధాన్యం సేకరణ వివరాలను అడిగి తెలుసుకుని ప్రభుత్వ విధివిధానాలను పాటిస్తూ రైతులకు సహకరించాలన్నారు. అనంతరం గోదాంలోని ధాన్యాన్ని, బియ్యాన్ని పరిశీలించారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్ మట్టా ప్రసాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకటరావు, ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్రావు, భూక్యా ప్రసాద్, తాతారావు, కోమటి ప్రసాద్, రఘుపతి, వెంకటేశ్వరరావు, భాగం రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
‘కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి’
సత్తుపల్లి రూరల్, నవంబర్ 22 : ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ఎంపీపీ దొడ్డా హైమావతి అన్నారు. మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రామానగరం, సదాశివునిపాలెం, కిష్టారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆమె మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు తుంబూరు సరస్వతి, వేల్పుల కళావతి, చెట్టుమాల రేణుక, పాలకుర్తి సునీత, మోహనరావు, తుంబూరు దామోదర్రెడ్డి, మోహనరెడ్డి, రాఘవరెడ్డి, నాగబాబు, పుష్ప, కృష్ణవేణి, లత, కోటమ్మ, కొడిమెల అప్పారావు, జువ్వాజి అప్పారావు, నాగేశ్వరరావు, హరిబాబు, సత్యనారాయణ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
వేంసూరు, నవంబర్ 22 : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే రైతులకు మద్దతు ధర లభిస్తున్నదని ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు అన్నారు. కుంచపర్తి, చిన్నమల్లేల, రామన్నపాలెం, అడసర్లపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు దొడ్డా శ్రీలక్ష్మీ వెంకటకృష్ణారెడ్డి, వేల్పుల ప్రేమలత, నాగుల్మీరా, సుధాకర్, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, అనూష, కావ్య, చెన్నారావు, తులసి, ప్రసాద్, చంద్రశేఖర్ రెడ్డి, కూకలకుంట శ్రీనివాసరావు, పుల్లారెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.