తల్లాడ, నవంబర్ 22: రైతులు పండించిన చివరి ధాన్యపు గింజనూ ప్రభుత్వం కొంటుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండల కేంద్రంలోని సొసైటీ ఆవరణలో మంగళవారం ఆయన ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ మధుసూదన్తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఏ ఇతర రాష్ర్టాల్లోనూ ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా బాధ్యతలను విస్మరించిందని ధ్వజమెత్తారు.
తెలంగాణ రైతులు పంజాబ్లో కంటే ఎక్కువ ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తారన్నారు. చెరువుల పునరుద్ధరణతో భూగర్భజలాలకు ఢోకా లేదన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి మంచి రోజులు వచ్చాయన్నారు. పంటల కోసం సీఎం కేసీఆర్ కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేశారన్నారు. కోటి ఎకరాల మాగాణి చేస్తున్నారన్నారు. రైతుబంధు ద్వారా రైతులకు సీజన్కు ముందే పెట్టుబడి సాయం అందుతున్నదన్నారు. సర్కార్ రైతన్నకు అండగా నిలుస్తున్నదన్నారు.
రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నదన్నారు. కేసీఆర్కు ప్రజలు, రైతులు అండగా నిలవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే సండ్ర, డీఆర్డీఏ పీడీ విద్యాచందన, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావును గ్రామస్తులు సత్కరించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రెడ్డెం వీరమోహన్రెడ్డి, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, వైస్చైర్మన్ రేగళ్ల సత్యం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దుగ్గిదేవర వెంకట్లాల్, వైరా వ్యవసాయ మార్కెట్ వైస్చైర్మన్ దూపాటి భద్రరాజు, సర్పంచ్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారపోగు వెంకట్, నాయకులు బొడ్డు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, కోటిరెడ్డి, నాయుడు శ్రీనివాసరావు, మురళి, రామిరెడ్డి, జీవీఆర్, ప్రసాద్, సంఘసాని శ్రీనివాస్, వెంకటి, నాగేశ్వరరావు, కిరణ్బాబు, కృష్ణయ్య, నరేశ్రాజు, శీలం శ్రీనివాసరెడ్డి, శశికుమార్, పమ్మి కృష్ణ, ఎంపీటీసీ రుద్రాక్ష బ్రహ్మం, సొసైటీ సొసైటీ డైరెక్టర్లు, సర్పంచ్లు పాల్గొన్నారు.