బోనకల్లు: మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన దివ్యాంగులసంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు యాలముడి కృష్ణమూర్తి(70) గురువారం గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన వికలాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేశారని ఆ సంఘం నాయకులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు ఆయన కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
బోనకల్లు, చింతకాని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, పెంట్యాల పుల్లయ్య, చింతకాని ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, జడ్పీటీసీ పర్సగాని తిరుపతికిషోర్, కిలారి మనోహర్, మంకెన రమేష్, తదితరులు ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.