ఖమ్మం ఫిబ్రవరి 21 : ఖమ్మం నగరం త్రీటౌన్లోని గోళ్లపాడ్ చానల్ మురుగు కాలువ రూపురేఖలు మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించారని, ఆ నిధులతో ఆధునీకరణ పనులు చేపట్టి అద్భుతంగా తీర్చిదిద్దినట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొ న్నారు. కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, ము న్సిపల్ ఎస్ఈ రంజిత్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన మంగళవారం సూర్యోదయ సమయంలో వాక్త్రూ చేశారు.
పార్కుల అందాలను తిలకిస్తూ, సౌకర్యాలపై ఆరా తీశారు. వాకింగ్, ఆటలు ఆడేవారితో మాట్లాడుతూ దాదా పు 6 కిలో మీటర్లు నడక కొనసాగించారు. దాదాపు 2 గంటల పాటు పార్కుల్లో గడిపారు. ఉదయం 7 గంటలకే 34వ డివిజన్ పరిధిలోని పిల్లిచిన్నకృష్ణతోటలో గోళ్లపాడు చానల్పై కొం డా లక్ష్మణ్బాపూజీ పేరుతో నిర్మించిన పార్కులో కలెక్టర్, మేయర్, కమిషనర్లు కలియ తిరిగారు. చిల్డ్రన్ పార్క్, ఓపెన్జిమ్, తెలంగాణ క్రీడాప్రాంగణం, బాస్కెట్బాల్ కోర్టు ను పరిశీలించారు. రంగనాయకుల గుట్ట వద్ద నుంచి 31వ డివిజన్లోని పంపింగ్వెల్ రోడ్ వరకు కాళోజీ నారాయణరావు పేరుతో నిర్మించిన పార్కులో వాకింగ్ చేశా రు. ఈ పార్కులో నిర్మించిన బస్తీదవాఖానను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి నుంచి పంపింగ్వెల్ రోడ్, సుందరయ్య నగర్ వరకు మంచికంటి రాంకిషన్రావు, సుందరయ్య నగర్లో ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో నిర్మించిన పార్కును సందర్శించి స్కేటింగ్, చెస్బోర్డు, టాయిలెట్స్ను సందర్శించారు.
మంత్రి పువ్వాడ కృషితో రూ.200 కోట్ల
విలువైన ఆస్తుల సృష్టి : కలెక్టర్ వీపీ గౌతమ్
ఖమ్మం నగరంలోని గోళ్లపాడ్ ఛానల్ మురుగు కాలువను నామ రూపాల్లేకుండా చేసి సుమారు రూ.200 కోట్ల విలువైన స్థలాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మంత్రి పువ్వాడ అజయ్కుమార్, గత కలెక్టర్లు లోకేశ్కుమార్, కర్ణన్, కమిషనర్ అనురాగ్జయంతి, మేయర్, ఇతర అధికారుల సహకారం ఎంతో ఉందని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం సుందరయ్యనగర్లో నిర్మించిన ప్రొఫెసర్ జయశంకర్ పార్క్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ 2016లో తెలంగాణలోని అన్ని పట్టణాలు పర్యటిస్తూ ఖమ్మం వచ్చిన సందర్భంలో గోళ్లపాడ్ చానల్ మురుగు కాలువను చూసి చలించారని, వెంటనే రూ.70 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. ఆ నిధులతో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కార్పొరేటర్ల సహకారంతో కాలువపై ఉన్న ఆక్రమణలను తొలగించి, కాలువ అంతర్భాగంలో మురుగు, వర్షపు నీరు పారడానికి పైపులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నో సంవత్పరాల నుంచి 10.6 కిలోమీటర్లు పొడవునా ఉన్న కాలువ ఆక్రమణలు, సిల్ట్తో కుచించిపోయిందని అలాంటి కాలువను పూర్తిగా మార్చగలిగామన్నారు. కాలువపైభాగాన దాదాపు పది చోట్ల పార్కులు, క్రీడాప్రాంగణాలు, బస్తీదవాఖానలు, పట్టణ ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడాప్రాంగణాలు, వాకింగ్ ట్రాక్లు సుందరంగా నిర్మించామన్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో ప్రస్తావించారన్నారు.
అండర్గ్రౌండ్ డ్రైనేజీని నిర్మించి నగరంలో దాదాపు 23 డివిజన్లకు సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి కావొచ్చిందన్నారు. మంత్రి పువ్వాడ కృషితో మరో రూ.30 కోట్లు మంజూరయ్యాయని, వీటికితోడు కార్పొరేషన్కు చెందిన నిధులను కేటాయించి ప్రజలకు సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ కాలువ పొడవునా సుమారు 32 ఎకరాల స్థలాన్ని సృష్టించామని, నగరాల్లో ఇంత పెద్దమొత్తంలో స్థలం అందుబాటులో ఉండదని, విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తే రూ.200 కోట్లకు పైగా ఆస్తి ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇక్కడి నుంచి తరలించినవారికి వెలుగుమట్ల వద్ద స్థలాలు ఇచ్చామని ప్రస్తుతం ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరగడంతో వారంతా సంతోషంగా ఉన్నారన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, కార్పొరేటర్లు రుద్రగాని శ్రీదేవి, తోట ఉమారాణి, గజ్జల లక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు రుద్రగాని ఉపేందర్, తోట వీరభద్రం, గజ్జల వెంకన్న, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, డీఈ నవ్యజ్యోతి తదితరులు పాల్గొన్నారు.