ఖమ్మం : రెవిన్యూ డివిజన్ కార్యాలయ పరిధిలో ఉన్న వయో వృధ్ధుల సంరక్షణ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వయో వృద్దుల కోసం ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ కార్యక్రమాలు, తల్లిదండ్రుల పోషణ, సంక్షేమ చట్టంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామని తెలిపారు. దేశంలో వయో వృద్దుల సంఖ్య పెరుగుతుందని వీరి అనుభవాలు కుటుంబానికి, సమాజానికి ఎంతో ఉయోగమాన్నారు. జిల్లాలో ప్రభుత్వ వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుని దానిని త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.
అనంతరం డాక్టర్ వెలిగేటి చంద్రమోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో సేవా చేస్తున్న వయో వృద్దులు వెంపటి సత్యనారాయణ(చిత్రలేఖనం)నంద్యాల అప్పారావు(ఉత్తమ రైతు), కడివెండి వేణుగోపాల్( సామాజిక పర్యావరణ కార్యకర్త), కరీనాబేగం(సంఘ సంస్కర్త)లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాదికారి సంద్యారాణి, వయోవృద్దులు ఆర్ రవీందర్, సుబ్బయ్య, కొత్త సత్యనారాయణరెడ్డి, హనుమంతరావు, శ్రీనివాసరావు, ఉపేందర్రెడ్డి, వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ, నర్సయ్య, లక్ష్మీనారాయణశర్మ, కుటుంబరావు, గోవర్థన్, డాక్టర్ వి. విజయలక్ష్మీ, డాక్టర్ సుశీల తదితరులు పాల్గొన్నారు.