బూర్గంపహాడ్/ మణుగూరు టౌన్/ అశ్వాపురం, సెప్టెంబర్ 28: తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అందుతున్న ఈ పథకాలకు ఆకర్షితులయ్యే ప్రజలందరూ టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని రాష్ట ప్రజలందరూ విశ్వస్తున్నారనేందుకు ఈ చేరికలే నిదర్శనమని అన్నారు.
బూర్గంపహాడ్ మండలం మోరంపల్లిబంజరలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 150 కుటుంబాల ఆరు బుధవారం ఆ గ్రామంలో ప్రభుత్వ విప్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారందరికీ ఆయన గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. బీజేపీ, కాంగ్రెస్లు విమర్శలు చేయడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు శ్రీలత, గోపిరెడ్డి రమణారెడ్డి, పొడియం నరేందర్, భూపెల్లి నర్సింహారావు, చేతుల పెద్దవీర్రాజు, లక్ష్మీనారాయణరెడ్డి, యక్కంటి శ్రీనివాసరెడ్డి, బాలిరెడ్డి, మారుడి రామలక్ష్మి, హంస తదితరులు పాల్గొన్నారు.
మణుగూరులో 25 కుటుంబాలు..
మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ సమక్షంలో మున్సిపాలిటీలోని కోటకట్టకు చెందిన 25 కుటుంబాల వారు కూడా టీఆర్ఎస్లో చేరారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పోశం నర్సింహారావు, ముత్యం బాబు, అడపా అప్పారావు, రామిడి రామిరెడ్డి, బొలిశెట్టి నవీన్, కుర్రి నాగేశ్వరరావు, జావేద్పాషా, తాళ్లపల్లి యాదగిరి, ముదంగుల కృష్ణ, తాతా రమణ, సకిన బాబూరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ఉత్తమ రెస్టారెంట్ అవార్డు గ్రహీత, వేణు రెస్టారెంట్ అధినేత లక్కం లక్ష్మీనారాయణను ప్రభుత్వ విప్ రేగా సత్కరించారు.
అశ్వాపురంలో 25 కుటుంబాలు..
అశ్వాపురం మండలం గొందిగూడెంలోని కాంగ్రెస్కు చెందిన 20 కుటుంబాల వారు మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.