కొణిజర్ల/ వైరా టౌన్, ఆగస్టు 16: సబ్బండ వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. భవిష్యత్తంతా బీఆర్ఎస్దేనని, కేసీఆర్ మూడోసారీ ముఖ్యమంత్రి కావడం ఖాయం స్పష్టం చేశారు. ఇప్పటికే ఆయన అమలు చేస్తున్న పథకాలకు ప్రజల్లో ఎంతో ఆదరణ లభిస్తోందని అన్నారు. అందుకు అనుగుణంగానే ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా వచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. కొణిజర్ల మండలం గోపవరం, పెద్దరామాపురం, లక్ష్మీపురం గ్రామాల్లోని కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన సుమారు 100 కుటుంబాల వారు బీఆర్ఎస్ నాయకులు ఏలూరి శ్రీనివాసరావు, పోట్ల శ్రీనివాసరావు, సర్పంచ్ అద్దంకి చిరంజీవి ఆధ్వర్యంలో వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాములునాయక్ సమక్షంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా వారందరికీ వైరా ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీలో చేరినవారందరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కిలారు మాధవరావు, చెరుకుమల్లి రవి, డేరంగుల బ్రహ్మం, తాళ్లూరి చిన్నపుల్లయ్య, పోగుల శ్రీనివాసరావు, చల్లా మోహన్రావు, బండారు కృష్ణ, భుక్యా మాన్సింగ్, భుక్యా నరసింహానాయక్, వడిత్యా రంగ, రాయల నాగేశ్వరరావు, కొర్రా కాంతమ్మ, రంగు సత్యనారాయణ, షేక్ సోందు, గుర్రం రామకృష్ణ, లకావత్ దేవేందర్, దావా విజయ్కుమార్, సంతోష్, పిట్టల వెంకటేశ్వర్లు, నరసింహారావు, వీరన్న తదితరులు పాల్గొన్నారు.