తల్లాడ, డిసెంబర్ 4 : పేదింటి ఆడబిడ్డకు సీఎం కేసీఆర్ పెద్దన్నగా వ్యవహరిస్తూ ఆడబిడ్డ కల్యాణానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బిల్లుపాడు, కొత్తవెంకటగిరి, రామచంద్రాపురం, గూడూరు, నూతనకల్, మల్సూరుతండా, రంగంబంజర, మిట్టపల్లి గ్రామపంచాయతీల్లో కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం ఆయన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం ద్వారా 10500 మందికి సుమారు వంద కోట్ల మేర అందజేశామన్నారు.
సీఎం సహాయ నిధి ద్వారా 3560 మంది లబ్ధిదారులకు 17 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు అందజేశామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ దుగ్గిదేవర వెంకట్లాల్, ఏఎంసీ వైస్చైర్మన్ దూపాటి భద్రరాజు, సర్పంచ్ లు శీలం కోటారెడ్డి, నునావత్ కవిత, మాలోత్ కల్యాణి, రుద్రాక్షల బ్రహ్మం, కోపెల కనకయ్య, నాయుడు శ్రీనివాసరావు, మురళి, కేతినేని చలపతి, కొండపల్లి చంద్రశేఖర్, జీ వీ ఆర్, ఇనుపనూరి సుదర్శనం తదితరులు పాల్గొన్నారు.
మహాప్రస్థాన వాహనం ప్రారంభం
కల్లూరు, డిసెంబర్ 4 : సత్తుపల్లి తర్వాత అత్యధిక జనాభా కలిగిన మేజర్ పంచాయతీలో మహాప్రస్థానం వాహనం ఆవశ్యకత గుర్తించి కులమతాలకు అతీతంగా ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కల్లూరు ఆర్యవైశ్య వెల్ఫేర్ సొసైటీ (కల్లూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రూ.15 లక్షల విలువైన మహా ప్రస్థానం నూతన వాహనాన్ని, 108, ప్రస్థానం వాహనం నిలిపే షెడ్డును ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వాహన ఏర్పాటుకు కృషి చేసిన ఆర్యవైశ్య సంఘ నాయకులు, దాతలకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, సంఘం బాధ్యులు బీరవల్లి రఘు, కట్టా అజయ్కుమార్, పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, చారుగండ్ల అచ్యుతరావు, వెంకటేశ్వరరావు, గుర్రం పూర్ణచందర్రావు, కొప్పారపు బలరామ్, సముద్రాల పుల్లారావు, పెడకంటి రామకృష్ణ, కొరకొప్పు ప్రసాద్, కొప్పురావూరి ఆంజనేయులు, రాచమళ్ల నాగేశ్వరరావు, గుర్రం శ్రీనివాసరావు, వీరభద్రరావు, కాటేపల్లి రజనీకాంత్, చుండూరు శ్రీనివాసరావు, సందీప్, ఉబ్బన వెంకటరత్నం, సీహెచ్ కిరణ్, గంధం వీరబాబు, మిట్టపల్లి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.