కారేపల్లి, డిసెంబర్ 10 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింట్లో పుట్టిన ఆడబిడ్డలకు కొండంత భరోసానిస్తున్నాయని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండల కేంద్రంలోని వైఎస్ఎన్ గార్డెన్లో శనివారం 52మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ సుపరిపాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, అధి కార యంత్రాం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. గతంలో లేనివిధంగా గ్రామాల్లో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ కఠోర దీక్షతో రాష్ర్టాన్ని సాధించి అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే రాష్ట్ర ప్రజానీకానికి శ్రీరామరక్షగా నిలుస్తుందన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ మాలోత్ శకుంతల, జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు తోటకూరి రాంబాబు, అజ్మీరా వీరన్న, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గుగులోత్ శ్రీను, సింగరేణి సర్పంచ్ ఆదెర్ల స్రవంతి, సంత ఆలయ చైర్మన్ మల్లేల నాగేశ్వరరావు, కో-ఆప్షన్ ఎండీ హనీఫ్, తహసీల్దార్ కె.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.