రఘునాథపాలెం, ఫిబ్రవరి 6 : రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. సోమవారం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వారికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్ తేజావత్ కళావతి, తేజావత్ సౌమిత్, లాల్కుమార్, చిర్రా రామకృష్ణ, ఆదినారాయణ, తగరం కిరణ్, సాయి, బానోతు ఉపేందర్, హరీశ్, భీమా ఉన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, గ్రామశాఖ అధ్యక్షుడు తొలుపూనూరి దానయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుతుంబాక నరేశ్, నాయకులు వర్దెబోమిన కోదండరాములు, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మాలోతు రమేశ్, గుగులోతు ప్రవీణ్, కూరాకుల సత్యం, పరిటాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.